ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎర్రమఠం చెంచుగూడెంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చెంచుగుడాన్ని సందర్శించి డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ చెంచుగూడెంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు కల్పించే విషయంలో పైప్ లైన్ వేసి కుళాయిలు బిగించారు గాని, కరెంటు బోర్డు రెండు నెలల కింద కాలిపోయిన ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు పోయిన పాపాన లేదని ఎక్కడో కొండల్లో నుంచి ఎర్రమఠం గ్రామానికి వెళుతున్న నీటిని వాడుకొని కాలం ఎల్ల తీస్తున్నారని ఆయన అన్నారు. చాపల లైసెన్సులు ఆ శాఖ అధికారులు రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు అన్నారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎర్రమఠం చెంచుగుడాన్ని సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని లేనిపక్షంలో ఈ విషయాలపై శాసనసభ్యులు గిత్త.జయసూర్య, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News