Saturday, 13 June 2026 04:23:53 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

సేంద్రియ సాగుతో డ‌బుల్ ధ‌మాకా..! ఉద్యాన ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 13 February 2026 08:09 AM Views : 138

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్ టి ఆర్ జిల్లా/రెడ్డిగూడెం : వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు 'డబుల్ ధమాకా' లాంటి మేలు జరుగుతుందని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తిరువూరు ఆర్‌డీవో కె.మాధురితో కలిసి రెడ్డిగూడెం మండలంలోని, రంగాపురం గ్రామంలో పర్యటించి, మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు ఉత్ప‌త్తిదారుల సంస్థ‌ల (ఎఫ్‌పీవో) అభ్యుద‌య రైతుల‌తో మాట్లాడి ఫ్రూట్ క‌వ‌ర్ల వినియోగం, ప్ర‌యోజ‌నాల‌ను అడిగి తెలుసుకున్నారు. స్వ‌యంగా మామిడి కాయ‌ల‌కు ఫ్రూట్ క‌వ‌ర్లు వేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ మామిడి రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని.. ఉద్యాన ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఫ్రూట్ క‌వ‌ర్లు వ‌ల్ల ఎలాంటి మచ్చ లేని, మంచి రంగుతో ప‌రిమాణంలో మామిడి దిగుబ‌డి ఉంటుంద‌న్నారు. హెక్టారుకు 15 వేల క‌వ‌ర్ల‌ను 50 శాతం రాయితీతో ప్ర‌భుత్వం అందిస్తోంద‌న్నారు. ఇలాంటి మామిడికి మార్కెట్లో మంచి రేటు ఉంటుంద‌ని, వినియోగ‌దారుల‌కు కూడా మంచి నాణ్య‌మైన ఆరోగ్య‌క‌ర పండ్లు ల‌భిస్తాయ‌న్నారు. నిమ్మ‌కాయ సైజులో కాయ ఉన్న‌ప్పుడు క‌వ‌ర్ కట్టడం వల్ల పండ్ల ఈగలు, ఇతర కీటకాలు కాయను ఆశించలేవ‌ని.. దీనివల్ల రైతుకు పురుగుమందుల ఖర్చు బాగా త‌గ్గుతుంద‌ని, రసాయన అవశేషాలు లేని పండ్లు ఉత్ప‌త్తి అవుతాయ‌ని వివ‌రించారు. మామిడి రైతులు కూడా 100 శాతం ప్ర‌కృతి సేద్య విధానాల‌ను అనుస‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం కృషితో ప్ర‌భుత్వం మామిడి సేక‌ర‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మామిడి రైతులు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మామిడి రైతుల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్న కోడి పేనుపై దృష్టిసారిస్తున్నామ‌ని, శాస్త్ర‌వేత్త‌ల స‌హ‌కారంతో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :