ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో ఉన్న (ఆర్ ఎస్ కె) రైతు సేవా కేంద్రంలో “రైతన్నా.. మీ కోసం” వర్క్షాప్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు అవగాహన కల్పించడానికి “రైతన్నా.. మీ కోసం” కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టడం జరిగిందన్నారు. అగ్రిటెక్ సాగుకు టెక్నాలజీ తోడైతే ఇక మన రైతులకు తిరుగుండదన్నారు. అందుకే అగ్రి టెక్ ను ప్రోత్సహిస్తున్నాం మని, రాష్ట్రంలో ప్రతీ రైతుకు ఏపి ఫార్మర్ రిజిస్ట్రే పధకంలో 'యూనిక్ ఐడి'ల నమోదుతో ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తున్నాం. డ్రిప్, స్ప్రింక్లర్ ల సేద్యాన్ని విస్తరించి, నీటి వినియోగ సామర్థ్యాన్ని 40-50% వరకు పెంచి రైతు ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పై గత ప్రభుత్వం రద్దు చేసిన 100 శాతం సబ్సిడీని ఈ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. అలాగే ప్రకాశం, రాయలసీమ జిల్లాల మధ్యతరగతి (10 ఎకరాల లోపు) రైతులకు గత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించగా దాన్ని ఈ ప్రభుత్వం 90 శాతానికి పెంచిందన్నారు. యంత్రాలు, టెక్నాలజీ వాడుకతో వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుందన్నారు. అందుకే వ్యక్తిగతంగా రైతులకు యంత్రాలు సరఫరా చేస్తోంది, కిసాన్ డ్రోన్ సేవలు అందిస్తోంది. పంటల విస్తీర్ణం తెలుసుకోడానికి, పంటల ఆరోగ్య స్థితి అంచనా వెయ్యడానికి శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నాంమని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, టీడీపీ నాయకులు నారపు రెడ్డి, మల్లారెడ్డి, మన్సూర్, నాగేశ్వరరావు, రఫిక్, జెడ్ వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, జహ్రుల్లా, శివారెడ్డి, లింగన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అగ్రికల్చర్ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News