Friday, 31 July 2026 10:40:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తున్న డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఇతర నాయకులు

Date : 09 January 2026 10:57 PM Views : 156

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, ఎస్సై పి.తిరుపాలు, తదితర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్యకు నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు వినతి పత్రం సమర్పించి విన్నవిస్తూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలోని సర్వే నంబరు-504లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమినీ గ్రామంలోని ఎస్సీలు దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నా, అధికారులు ఇంతవరకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చెయ్యలేదని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేక సాగు చేసుకుంటున్న ఎస్సీ రైతులు సబ్సిడీ విత్తనాలు, క్రాప్ లోన్లు రైతు భరోసా లాంటి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందడం లేదని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం రీసర్వే పేరుమీద రాష్ట్రవ్యాప్తంగా భూములను కొలతలు వేస్తున్నదని, మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలైనా ఇంతవరకు సర్వే నంబర్ 504 గురించి రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయంపై తొందరగా నిర్ణయం తీసుకుని సాగు చేసుకుంటున్న ఎస్సీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా మండలంలోని నాయకులు, ప్రజలు ఇచ్చిన సమస్యల అర్జీలకు అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషణ్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకులు జి.హరి ప్రసాద్ యాదవ్, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి నాయకులు బోనపల్లె వినయ్ కుమార్, ఆదిరెడ్డి, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఐకెపి ఎపిఎం-ఉమామహేశ్వరి, వీఆర్వో శివన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :