ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో నెల్లూరు న్యాయవాదుల సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులను కోరారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి నెల్లూరు సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార నిమిత్తం కర్నూలు న్యాయవాదుల సంఘం ఆయన న్యాయవాదులను మొదటి ఓటు అభ్యర్థన చేయడం జరిగినది అదేవిధంగా ఆయనకు కర్నూలు న్యాయవాదులందరూ సంఘీభావం అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత న్యాయవాదులకు ఏమి చేస్తానని అనేక వాగ్దానములు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగనాథ్, ఓంకార్, ప్రభాకర్ రెడ్డి, చిన్నయ్య, నవీన్, నరసింహులు, మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళల న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొని, ఆయనకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆయన కూడా నన్ను కర్నూలు న్యాయవాదులు అభినందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని కర్నూలు న్యాయవాదుల సంఘం నందు మీటింగ్ ఏర్పాటు చేసి, ఆయనను అభినందించడం జరిగింది.
Admin
E Nivas News