ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాల నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు నిర్మల్ జిల్లా ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వo 1/4/2026 వ తేది నుండి 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కార్మిక వర్గం ఆఖరి ప్రయత్నoగా ఫిబ్రవరి 12వ తేదిన సార్వత్రిక సమ్మె ను చేపట్టిం దన్నారు. అయిన కూడా మోడీ ప్రభుత్వ మొండి వైఖరి మార్చలేక పోయింది,4 లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటా మన్నారు.ఇందులో భాగంగా కొమరం భీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 4 లేబర్ కోడ్ లకు సంబందించిన ప్రతులను దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు టీ యు సి ఐ జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి, సి ఐ టీ యు జిల్లా అధ్యక్షులు రాజేందర్, ఏ ఐ టీ యు సి ఉపాధ్యక్షులు చిరంజీవి పాల్గొన్నారు.
Admin
E Nivas News