ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన బాసర సరస్వతి పుణ్యక్షేత్రం ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ"225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం 20,వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ఉన్న బా సర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగు ల మేర విస్తరించనున్నా రు. కొత్త ఆలయ శిఖరాలు మండపాలు మాఢ వీధులు ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పార తో మట్టి తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులనుఆదేశించారు.ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబంతో కలిసి బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంప తులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసంచేయించారు. తరువాత బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయ విస్తరణ పనులను చేసేందుకు అధికారులు మాస్టర్ప్లాన్ రూపొందిం చారు. ఈ ప్లాన్లో ఆలయ పునరాభివృద్ధి నమూనా లోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News