ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండలంలోని పలు గ్రామపంచాయతీల సర్పంచులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ను కలిసి తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. గ్రామాలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్ వంటి మౌలిక సదుపాయాల పనులను మంజూరు చేయాలనీ వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో అంకుశపూర్ సర్పంచ్ టేకం గంగారాం, వావుదాం సర్పంచ్ కోరేంగ జూగాది రావు , గోవిందపూర్ సర్పంచ్ గెడకర్ చరణ్ , తుంపల్లి సర్పంచ్ టేకం ఈశ్వరీబాయి, ఎల్లారం సర్పంచ్ కాతిలే నీలాబాయి , మోవాడు సర్పంచ్ కోర్కెట సుష్మ, వెంకట పూర్ సర్పంచ్ వెడ్మ నీలా,చిలాటిగూడా ఉపసర్పంచ్ వినోద్, ఆడ దస్నాపూర్ మాజీ సర్పంచ్ కోరేంగ లింగు పాల్గొన్నారు.
Admin
E Nivas News