ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించి దాదాపు 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా సభలో సభలో సీఎం మాట్లాడుతూ సీఎంఆదిలాబాద్ జిల్లాను మొదటి నుంచి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ముందుగా తాను సీఎం పదవి చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని సంతకం పెట్టినట్లు చెప్పారు. చదువు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇక్కడి నాయకులే చర్చించుకొని తమకు తెలిపినట్లైతే అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అన్నారు. కొమరం పుట్టిన గడ్డ కాబట్టి తనకు ఎంతో ఇష్టమని ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడే ఉందని గత పది సంవత్సరాల పాలనలో పెద్దమనిషి ఏం అభివృద్ధి చేశాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు నాయకులు మూడు ప్రాంతాల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అంటున్నారని పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో, వెడమ బొజ్జు, ఖానాపూర్ లో ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. అందుకోసమే ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకొని చెప్తే త్వరగా జరుగుతున్న జరుగుతాయని తెలిపారు. నాకు మాత్రం ఇంద్రవెల్లి లో యూనివర్సిటీకి పెడితే బాగుంటుంది అని అన్నారు. నా మనసుకైతే అలా అనిపిస్తుం దని తెలిపారు. అక్కడ నాగోబా జాతర ఉంటుందని అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ అని బాగుంటుందన్నారు. పోరాట వీరుడు కొమరం భీమ్ పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని సీఎం అన్నారు. అనుమతి ఇచ్చేది మాత్రం నేనేనని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ పంచాయతీలో నన్ను లాగ వద్దని అన్నారు. తుమ్మిడి హేట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించి రైతాంగాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. త్వరలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి ఆదిలాబాద్ కు వస్తారని అన్నారు. అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక 61 వేలమందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగనియామక పత్రాలు అందజేశానని తెలిపారు. గత పాలకులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. వారు 10 సంవత్సరాలలో సంపాదించిన డబ్బు కోసం కుటుంబీకులంతా గొడవ పడుతున్నారని చెప్పారు. ఇక వారి ఖేల్ కతం దుకాణం బంద్ అని స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు జేబులో వేసుకొని మూడు సంవత్సరాలకే కూలేశ్వరం ప్రాజెక్టు అయిన మాట వాస్తవం కాదా అన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ గేడంనగేష్, ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ ఎమ్మెల్యేలు వెడమ బొజ్జు, పాయల శంకర్ ఎమ్మెల్సీ దండే విటల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News