Wednesday, 01 April 2026 01:56:00 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు...

Date : 31 March 2026 10:16 PM Views : 9

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఒక పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను జలగలాగ పీడించి ఉండకపోతే అంతలా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. నీతి లేదు నియమం లేదు,కనీసం మానవత్వం కూడా ఉండటం లేదు. దినసరి కూలీలను కూడా వదలరు. కేసు వచ్చిందంటే. పీక్కు తినడమే ఆ ఎస్ఐ తీరు. అందరూ అలా ఉండరు కానీనీతిగా ఉండి విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు సిబ్బంది ఉన్నారు. కానీ ఇప్పుడు అవినీతి పరుల సంఖ్య పోలీస్ శాఖలో వేగంగా విస్తరిస్తోంది అనడంలో సందేహం లేదు అనే అభిప్రాయాలు సర్వత్వ వ్యక్తం అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సై హరిప్రసాద్ రెడ్డి పట్టు పడ్డారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు డబ్బులు ఇస్తుండగాట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనేఅంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలా మందిని డబ్బులకు పీడించాడని, దారుణంగా కొట్టేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా భూతగాదాలు, సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండుకున్నాడని బాధితులు ముక్త కంఠంతో తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :