Thursday, 30 July 2026 01:02:43 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఇందిరమ్మ చీరల పంపిణీ

Date : 25 November 2025 11:29 PM Views : 218

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలంలోని అంకతిపల్లిలో మంగళవారం ఇందిరమ్మ చీరలను మహిళలకు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు గ్రామంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని కొనియాడారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలని ఆలోచనతో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమం లో లక్షెట్టిపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గణవేణి పోచకుమార్, అంకతిపల్లి గ్రామ అధ్యక్షులు అరిగేల చందు, లింగంపల్లి వెంకటేష్, మోదల శ్రీను, అరిగేల భూమయ్య, చిన్నయ్య, మహేష్, మహిళా సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :