ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా బైoసా టౌన్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీలు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని పరిశీలకులు అజయ్ సింగ్, పిసిసి పరిశీలకులు, మిద్దెల జితేందర్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ,గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, నారాయణ రావు పటేల్,మాజీ మంత్రి గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారీ, మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, ఎక్స్ చైర్మన్ ధన్వాన్తరీ,జిల్లా కోఆర్డినేటర్ రాంభూపాల్,లకవత్ దాణపతి, డిసిసి అధ్యక్షులు కూచూరి శ్రీహరి , జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంగళవారం భైంసా రోడ్డులో ఉన్న గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ నడుం బిగించిందని తెలిపారు. దీనికి గాను ఆయా జిల్లాలోని నాయకులంతా అహర్నిశలు శ్రమించాల్సి ఉన్నదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు శ్రమించాలని నాయకత్వం ఆదేశించినట్లు తెలిపారు.
Admin
E Nivas News