Thursday, 30 July 2026 10:39:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఎమ్మార్వో ఆఫీసును ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో పెట్టడాన్ని ఆపేయాలి

రెడ్డి సంక్షేమ భవనంలో ఎమ్మార్వో ఆఫీస్ ను నిర్వహించుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ డిమాండ్

Date : 16 November 2025 07:39 AM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంథని సమీకృత హాస్టల్ భవనంలో ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం విద్యార్థులతో కలిపి ధర్నా చేయడం జరిగింది. అక్రమంగా అధికారులు పోలీసులను పంపించి దౌర్జన్యంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథనిలోని సమీకృత హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. సమీకృత డివిజన్ ఆఫీస్ నిర్మాణం చేయడం కోసం అప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంను సమీకృత బాలుర వసతి గృహంలోకి తరలిస్తున్నారు. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఎమ్మార్వో ఆఫీస్ని పెట్టడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణ కోసం ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలలో ఆఫీస్ నిర్వహణ చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీస్ నిర్వారణ ఇక్కడ ఎందుకు చేస్తున్నారని ఏ అధికారిని అడిగినా కూడా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు చేస్తున్నామని చెప్తున్నారని విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అధికారులే విద్యార్థులను ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణ కోసం రెడ్డి సంక్షేమ భవనం మరియు ఐకెపి భవనం కూడా ఉన్నాయి కావున అధికారులు విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణను ఆ భవనాలలో చేసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా మంథని sc బాలికల హాస్టల్ను కూలగొట్టి మంథని మున్సిపల్ ఆఫీస్కు కేటాయించడం జరిగింది. ఇలా కూలగొట్టుకుంటూ పోతే హాస్టల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కావున వెంటనే మంత్రివర్యులు స్పందించి ఆఫీస్ నిర్వహణను హాస్టల్లో కాకుండా వేరే భవనాలల్లో నిర్వహించే విధంగా చూడాలని కోరారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్ నాయకులు తిరుపతి, సందీప్, రాజ్ కుమార్, శ్రీశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :