ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం శుభనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక ఆర్ అండ్ బి విశ్రాంతిభవనంలో ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అరటిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సామాజిక సేవ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం నిజమైన కర్తవ్యమని తెలియజేశారు. 'ఇందిరా గాంధీ' భారతదేశంపై చెరగని ముద్ర వేసిన నాయకురాలు. ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దిశగా ముందుకు నడిపించాయన్నారు. భారతీయ మహిళలకు ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రధానమంత్రి, “ ఐరన్ లేడీ”గా దేశాన్ని ఎంతో ఆధునీకరించిన నేతగా,సమాజం కోసం, పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మార్గదర్శకురాలు ఇందిరా గాంధీ అన్నారు. ఆమె జీవితం నుండీ అందరూ స్ఫూర్తి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్,మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు అమీర్, రవీందేర్, హజీ, సుగుణకర్, రాజమౌళి, నర్సింమ చారి,దుమ్మని సత్యం మరియు కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News