Friday, 31 July 2026 09:48:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి...

విదేశీ ఉద్యోగాలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన

Date : 15 April 2026 11:28 PM Views : 162

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యువకులు విదేశాల్లో వచ్చే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టాంకామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, తెలంగాణ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏటీసీల ద్వారా 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం 4,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. టాంకామ్ ద్వారా నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తామని, ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురికాకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాల్లో భారతీయులకు మంచి పేరు ఉందని, అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారని గుర్తుచేశారు. నెలకు ₹2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందుతుందని తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువత టాంకామ్ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :