ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి ఉత్సవాల సందర్భంగా SSS యువసేన అధ్యక్షులు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో రజిని కుమార్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. మంత్రితో పాటు యువసేన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్త దానం చేశారు.
Admin
E Nivas News