ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పట్టణంలోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్, ఖానాపూర్, అంబేద్కర్ నగర్, ప్రాంతంలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో 100 మంది స్పెషల్ పార్టీ బలగాలు, పోలీసు సిబ్బంది పాల్గొని ప్రధాన వీధుల్లో మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలోపోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే సోషల్ మీడియా వేదికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక ఐపిఎస్, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, ఎం ప్రసాద్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News