ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందడం సహజమేనని ఉట్నూర్ డిప్యూటీ డిఈఓ చందన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగు సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పదవి విరమణ పొందిన రంగు సత్యనారాయణ దంపతులను శాలువా పూలమాలలతో సన్మానం చేశారు. అనంతరం డిప్యూటీవో మాట్లాడుతూ రంగు సత్యనారాయణ తన విధులను ఎంతో న్యాయబద్ధంగా నిర్వహించారని, ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ప్రతిచోట మంచి పేరు సంపాదించారని, ఇలాంటి వ్యక్తులు సమాజంలో కొందరే ఉంటారని పని చేసిన చోట మంచి పేరు వచ్చినట్లయితే జీవితాంతం విద్యార్థులకు గుర్తుండిపోతారన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన అనంతరం శేష జీవితాన్ని ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు. కేవలం గురువులకు మాత్రమే సమాజంలో మరచిపోని గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు అధికారులు సత్యనారాయణ సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను పలు షాట్ పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏపీవో ఏ భాస్కర్ ఏసీ ఎన్నో సిహెచ్ లక్ష్మయ్య మంచిర్యాల జిల్లా క్రీడల అధికారి బండ జీవరత్నం ఎస్ ఈ ఆర్ పి లు పి.చందు, రఘునాథం, ఎం శంకర్, వసతి గృహ సంక్షేమ అధికారి పి. రేవతి, జి సి డి ఓ పీ శకుంతల, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎంఏ గఫర్, పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News