Friday, 31 July 2026 10:40:23 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగాసావిత్రి బాయ్ పూలే 195వ జయంతి

Date : 03 January 2026 10:46 PM Views : 291

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, బిసి కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే స్పూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీ బాయి పూలే ఒకరన్నారు. సావిత్రిబాయి పూలే దేశంలో తొలి అధర్శ ఉపాధ్యాయురాలు అని విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీ బాయిని కదిలించాయన్నారు. అవమానాలను సైతం లెక్కచేయకుండా కులవ్యవస్థ నిర్ములకు కోసం పాటుపడడంతోపాటు వితంతువులకు, వృద్దులకు, ఒంటరి మహిళలకు చదువు అవసరమని చదువుతోనే సమాజంలో మహిళలకు గౌరవం,గుర్తింపు ఉంటుందని, పాఠశాలలు ప్రారంభించి అన్ని తరగతుల వర్గాల మహిళలకు సమానంగా విద్యను అందించిన మహనీయురాలు అన్నారు. నేటి సమాజంలోనే మహిళలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసి విధ్యాబోధనకు,బాలికలకు అంకితం చేసిన గొప్ప మహనీయురాలు, సంఘసంస్కర్త సావిత్రి బాయ్ పూలే అన్నారు. ఈ కార్యక్రమంలోవిద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :