ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ లోని బేగంపేటలో గల హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కొరకు షెడ్యూల్ కులములకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2 సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జిల్లా నివాసులై ఉండి జూన్ 1, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మీసేవ, మున్సిపల్ కార్పొరేషన్/ తహసిల్దార్ ద్వారా జారీ చేయబడి ఉండాలని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, జనన తేదీ, నివాస ధ్రువపత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని, జూన్ 1వ తేదీన డ్రా పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో పనివేళలలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News