Saturday, 13 June 2026 04:15:18 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ..

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:18 PM Views : 70

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ లోని బేగంపేటలో గల హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కొరకు షెడ్యూల్ కులములకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2 సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జిల్లా నివాసులై ఉండి జూన్ 1, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మీసేవ, మున్సిపల్ కార్పొరేషన్/ తహసిల్దార్ ద్వారా జారీ చేయబడి ఉండాలని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, జనన తేదీ, నివాస ధ్రువపత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని, జూన్ 1వ తేదీన డ్రా పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో పనివేళలలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :