ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బస్సులో ఒక మహిళ తన బ్యాగును మరిచిపోగా అట్టి బ్యాగును గుర్తించి పోగొట్టుకున్న మహిళకు స్థానిక పోలీసులు అందజేశారు. వివరాల్లోకి వెళితే గురువారం గొల్లపల్లి మండలం ధనురుకు చెందిన కొల్లూరి భాగ్యలక్ష్మిపని నిమిత్తం ఉట్నూరు వెళ్ళింది. అక్కడ పని ముగించుకొని తిరిగి అదిలాబాదు నుండి మంచిర్యాల వెళ్లే ఆదిలాబాద్ డిపో బస్సు ఎక్కి లక్షెట్టిపేట బస్టాండ్ లో దిగింది. ఆమె దిగిన తర్వాత తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోవడంతో వెంటనే లక్షెటిపేట పోలీసులకు సమాచారం అందజేసింది. లక్షెట్టిపేట బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న ఎంబడి సత్యనారాయణ, రాజేందర్ లు వెంటనే బస్టాండ్ చేరుకొని బస్సు వివరాలు సేకరించి మంచిర్యాల డిపో మేనేజర్ మాట్లాడి మహిళా మరిచిపోయిన బ్యాగును తిరిగి తెప్పించి బాధితురాలికి అప్పగించారు. మహిళ మర్చిపోయిన బ్యాగులో బంగారంతో పాటు నగదు కూడా ఉండడంతో తిరిగి తన వస్తువులను తాను తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసుల సేవల పట్ల బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.
Admin
E Nivas News