ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటమండలం ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరగడంతో పాటు విజయవంతంగా ముగిసింది. జాతరను ఘనంగా నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులు, భక్తులకు ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ కన్వీనర్ రత్నాకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం అభినందించారు. శనివారం సమ్మక్క సారలమ్మలను కోయ పూజారుల ఆధ్వర్యంలో చిలుకల గుట్టకు పంపే కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఈ జాతరకు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఇటిక్యాల గ్రామ జాతర కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశామని పేర్కొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన జాతర కమిటీ కన్వీనర్ రత్నాకర్తో పాటు గ్రామ కమిటీ సభ్యులను మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణంప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన లక్షేటిపేట మున్సిపల్ కమిషనర్కు, పోలీసు సిబ్బందికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి, గ్రామ పెద్దలకు, యువకులకు, గ్రామ కమిటీ సభ్యులకు పేరుపేరునాధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News