Friday, 19 June 2026 02:02:20 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

స్థానిక ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణ రావు

Date : 01 March 2026 08:53 AM Views : 102

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ల సత్యనా రాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పలు కీలక శాఖల్లో గిరిజన జాతి అధికారులు సేవలందించడం గర్వకారణమని పేర్కొన్నారు. జాతికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి దక్కే అదృష్టమని అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 2.కోట్ల వ్యయంతో సంత్ సే వాలాల్ మహరాజ్ బంజా రాభవనం మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూ ర్తి చేయుటకు చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గిరిజన సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే బంజా రా జాతికి విద్యా,విజ్ఞాన పరంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొని యాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసు కొని సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గిరిజన సంక్షేమ అధికారి నాగ సాగ ర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు దేవన్, కౌన్సిలర్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: