ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశ అత్యున్నత మైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరి కాదని దాన్ని సనాతనం తో ముడిపెట్టడం దివాలు కోరు రాజకీయమని వెంటనే అతనిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చెయ్యాలని కోరుతూ ఆదివారం లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ సనాతన దర్మం పేరిట హింసను ప్రోత్సహస్తే సనాతన దర్మం కూడా ఒప్పుకోదని, సనాతన దర్మం పేరిట దాడులు, చంపడాలు, బెదిరింపులు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగాయని, సనాతన దర్మం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది తప్పుడు ఉద్దేశ్యమని కావున సనాతన ధర్మం పేరిట దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోట్లాది హిందువులు ఆరాధించే సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన హిందూ మతానికి తప్పుడు అర్ధం ఇచ్చిన చిన్నజీయర్ ను ఏమనలేదని ఎందుకంటె అయిన బ్రాహ్మణుడని,అదే బ్రాహ్మణుడు పై ఇలాంటి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత స్థానంలో కూర్చోవడం సహించలేని ఆధిపత్య కుల దురహంకారమే ఆ రాకేష్ కిషోర్ ను ఉసిగొలిపిందన్న సత్యం అందరికీ అర్థమవుతుందని మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. గవాయి గారిపై జరిగిన దాడి ప్రపంచ దేశాల ముందు భారత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి కి జరిగిన అవమానం అన్నారు. ఇది న్యాయమూర్తి పై జరిగిన దాడి కాదని రాజ్యాంగం పై,బావ వ్యక్తికరణ పై జరిగిన దాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు దేవి జగన్, ఆవునూరి మురళి, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి ఆవునూరు ప్రసాద్, నాయకులు కామిల్ల రమేష్, దేవి భీమయ్య ఉరిమెట్ల అరవింద్, ఆదర్శ్, పల్లికొండ శ్రీనివాస్, ఆవునూరు రమేష్, దేవి సిద్దు దానపెళ్లి జమీస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News