Thursday, 02 April 2026 01:52:04 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

అధిక దిగుబడిపై రైతుల హర్షం

పుట్టపాకలో 'అయాన్ 2025' వరి రకం క్షేత్ర ప్రదర్శన.. మంథని

Date : 15 November 2025 01:00 PM Views : 523

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం పుట్టపాక గ్రామంలో అన్నదాత ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో జీనెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు చాట్లపల్లి రాజయ్య తన ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో జీనెక్స్ కంపెనీకి చెందిన 'అయాన్ 2025' వరి రకాన్ని సాగు చేశారు. శనివారం, ఈ క్షేత్రాన్ని ఇతర రైతులతో కలిసి జీనెక్స్ ప్రతినిధులు సందర్శించి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు చేసిన రైతు చాట్లపల్లి రాజయ్య మాట్లాడుతూ.. "అయాన్ 2025 రకాన్ని సాగు చేయడం ద్వారా ఎటువంటి పురుగు మందులు వాడకుండానే చాలా మంచి దిగుబడి సాధించగలిగాను. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని తెలిపారు. జీనెక్స్ కంపెనీ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ తమ కంపెనీ లక్ష్యం రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన వరి రకాలను అందించడమేనని పునరుద్ఘాటించారు. రాబోవు వేసంగి లో జినెక్స్ సీడ్స్ వారి దొడ్డు రకాలైన రాజా, తోప్ సింగ్ రకాలకు అన్నదాతలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కొత్త వంగడంపై ఆసక్తి చూపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :