Thursday, 30 July 2026 09:52:40 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బీసీల బందుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం

బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరంశంకర్ లాల్

Date : 16 October 2025 07:18 PM Views : 435

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీ సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందు పిలుపుకు పూర్తి మద్దతును తెలియజేస్తున్నట్లు బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరంశంకర్ లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వాస్తవానికి కూడా తక్కువేనని, ఎవరైతే ఎంత శాతం ఉంటారో అంత శాతం అన్ని రంగాలలో సమానమైన వాటా శాతాన్ని ఇవ్వడం న్యాయపరమైన విషయమన్నారు. దేశంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలు సగానికంటే ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని వాళ్లకు అన్ని రంగాలలో సగం వాటాను కల్పించడం న్యాయమైన నిర్నయమన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల కోసం త్యాగం చేయడం జరిగిందని, ఫూలేను గురువుగా స్వీకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అన్ని రంగాలలో వెనక్కి నెట్టివేయబడ్డ వారందరికీ రిజర్వేషన్లు అవసరమని సూచించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :