Thursday, 30 July 2026 08:00:29 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లి సమయం ఆసన్నమైంది...

మాజీ మంత్రి కేటీఆర్

Date : 05 July 2026 10:48 PM Views : 81

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లి సమయం ఆసన్నమైందని మాజీమంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదివారం కన్నెపల్లి పంపు హౌస్ కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.పోలీసులఆంక్షలు, అడుగడు గునా ఎదురైన అడ్డంకులను అధిగ మించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటల కు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవా ల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 8గంటల సమయం పట్టిం దని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణకు నీళ్లివ్వాలని కేసీఆర్ మహాయజ్ఞంలా కాళేశ్వరాన్ని నిర్మించారని, తాము ఇక్కడికి ఎవరినో నిందించడానికి లేదా, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరం బాసర నుండి గోదావరి పారుతు న్నా సమైక్య రాష్ట్రం లో తెలంగాణ ఎడారిలానే ఉండిపో యిందని, నీళ్ల కోస మే ఆనాడు ఉద్య మం చేశామని కేటీ ఆర్ గుర్తుచేశారు. పల్లం నుంచి నీటిని పైకి తేవచ్చని, మనం కూర్చున్న చోట 90 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నా యని కాళేశ్వరం నిరూపించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తుమ్మిడిహట్టి దగ్గర కడతామని ప్రజల ను మభ్యపెట్టారని, ఆనాడు మహారాష్ట్ర కు 152 మీటర్ల ఎత్తు పెంచవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ జల దౌత్యం జరిపి, మూడున్నరే ళ్లలో చర్యలు తీసు కుని, గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండే లా కన్నెపల్లి దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగితే కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచా రం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తానని చెప్పినా ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయం చేయడానికి ఇక్కడి కి రాలేదు కెసిఆర్, పట్టుదలతో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాలే శ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి, జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుం దని, వర్షాలు కురవకపోయినా కన్నెపల్లి వద్ద నీరు ఎప్పుడు నిలువ ఉంటుందని అన్నారు. మీకు చేతకాకపోతే కేసీఆర్ కు కాలేశ్వ రం ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, hకౌశిక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు నడిపెల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: