ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉచిత పీజీ కోచింగ్ మరియు యోగా కార్యక్రమాలునిర్వహించారు. లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూరు, కాగజ్ నగర్, మహిళా జగిత్యాల కళాశాలల తెలుగు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయి ఉచిత ఎం.ఏ తెలుగు ఎంట్రన్స్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ పిల్లలమఱ్ఱి రాములు గారు ముఖ్య అతిధిగా విచ్ఛేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ చదువు వల్లనే ఉన్నత స్థాయిలో స్థిరపడుతామని కాబట్టి ఉన్నత విద్యకోసం ప్రయత్నం చేయాలనీ పేర్కొన్నారు కోచింగ్ ద్వారా ప్రామాణికమైన పుస్తకాల జ్ఞానం , నాణ్యమైన బోధన లభిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి అంతర్జాల కోచింగ్ ఉచితంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. కాగా మంచిర్యాల ప్రిన్సిపాల్ డా. జైకిసాన్ ఓజా లక్షెట్టిపేట కళాశాల ప్రిన్సిపాల్ డా, మహాత్మా సంతోష్ మాట్లాడుతూ ఈ కోచింగ్ కి డా. తన్నీరు సురేష్ , డా. శ్రీధర హరీష్, డా. గోలి శ్రీలత, డా. లక్మీ నరసింహం , డా. పట్వర్ధన్ సారధ్యం వహిస్తున్నారని . తెలంగాణలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న , సుదీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులు కోచింగ్ లో పాఠాలు బోధిస్తారని విద్యార్థులు తమ అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కోచింగ్ 30 రోజుల పాటు ప్రతిరోజు అంతర్జాలం ద్వారా జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోని ఏ ప్రాంత విద్యార్థి అయినా సులభముగా ఈ సేవలను వినియోగించు కోవచ్చానినిర్వాహకులు తెలిపారు. సమన్వయకర్త తన్నీరు సురేష్ మాట్లాడుతూ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో విద్యా వారోత్సవాల్లో భాగంగా యోగాపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కామర్స్ అధ్యాపకులు జాడి శంకరయ్య యోగా మాస్టర్ గా వ్యవహరిస్తూ యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు యోగ ఆసనాలు వేస్తూ ఆయా ఆసనాల వలన కలిగే ఆరోగ్య లాభాలను పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని శరీరం ఉత్తేజాన్ని పొంది నూతన ఉత్సాహం లభిస్తుందని తెలిపారు. యోగా మన వారసత్వ సంపద అని పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులు, బోధనా బోధనేతర సిబ్బంది ప్రముఖ యోగ ఆసనాలు వేసి యోగా పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
Admin
E Nivas News