Saturday, 13 June 2026 04:27:02 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధం...

Date : 26 January 2026 08:53 AM Views : 227

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ములుగు జిల్లా లో నిర్వహించేమేడారం మహా కుంభమేళ జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు.ఈనెల 28 నుంచి 31 వరకు సాగే మహా జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పార్కింగ్ ప్రదేశా లు, ప్రయాణ ప్రాంగణాలు, వచ్చివెళ్లే మార్గాలలో ట్రాఫిక్ కనబద్దీకరణ దర్శనం సందర్భంలో రద్దీ నియంత్రణ భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. కొంతమంది నెలరోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు తరలి వస్తారని అంచనాతో పోలీస్​ శాఖ దర్శనం సందర్భంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది, ఈ ఏడాది జాతర ఏర్పాట్లలో సాంకేతికతకు పెద్దపీట వేయడం గమనార్హం.జాతర విధుల్లో పోలీసు శాఖది కీలక పాత్ర ఉంది. ఈ జాతర ముగిసే వరకు 25 మంది ఐపీఎస్​ల పర్యవేక్షణలో 13 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి ఆధ్వ ర్యంలో వరంగల్​ పోలీస్ కమిషనర్​ పర్యవేక్షణలో మేడారంలో రామగుండం సీపీ పర్యవేక్షణలో గద్దెలు, ట్రాఫిక్​ క్రమబద్ధీకరణ, జాతర కోర్​ ఏరియాలో భక్తుల రద్దీ నియంత్రణ విభాగాలు పని చేసేలా కసరత్తు చేశారు. అలాగే జాతరలో పాత నేరస్థుల సంచారం, తప్పిపోయిన వారి గుర్తింపు, దర్శన సందర్భంలో రద్దీ, ట్రాఫిక్ సమస్యలను గుర్తించేలా కృత్రిమ మేధతో సాంకేతి కతను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి కోసం 20 డ్రోన్​ కెమెరాలు, 450 సీసీ కెమెరాలను కమాండ్​ కంట్రో ల్​ రూంతో అనుసంధానించి నిఘా ఉంచుతున్నారు ఇక్కడ గతంలో ఏకకాలం లో అమ్మవార్ల గద్దెలను 2000 మంది దర్శించుకుం టే ప్రాంగణం రద్దీగా మారే ది. కాని ఇప్పుడు ప్రాంగణం విస్తరణతో ఒకేసారి 8-9 వేల మంది దర్శించుకునే సదుపాయం అందుబాటు లోకి వచ్చిందని అధికారు లు పేర్కొన్నారు. గతంలో సమ్మక్క-సారల మ్మ గద్దెల పక్కన పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలుండేవి. భక్తులు ఆ ప్రాంగణం లోపల వెనక్కి ముందుకు తిరిగేవారు. పునర్నిర్మాణంతో గద్దెలన్నీ ఒకే వరుసలోకి రావడంతో ఆ సమస్య వస్తుందని చెబుతున్నారు. జాతరలో భక్తుల రద్దీ అనుగుణంగా ప్రైవేటు వాహనాలకు ఊరట్టం గ్రామం వద్ద 33 పార్కింగ్​ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అలాగే గద్దెలకు సమీపం లోనే ఆర్టీసీ బస్టాండ్​, వీఐపీ వావానాలకు పార్కింగ్​ సౌకర్యం ఉంటుంది. జాతర తేదీల్లో 3 లక్షల వాహనా లొచ్చినా నిలిపేందుకు సుమారుగా 2 వేల ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సారి 500 బస్సులు పెంచను న్నారు. మహిళలకు ఆధార్​ గుర్తింపుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుం ది.మొబైల్​ సిగ్నల్​ కోసం బీఎస్​ఎన్​ఎల్​ 10 తాత్కా లిక టవర్లను ఏర్పాటు చేసింది. మేడారం మహాజాతరకు చేరుకొనే మార్గంలో 39 చోట్ల రహదారులను అభి వృద్ధి చేశారు. అంతేకాదు తాడ్వాయి, పస్రా, బయ్యక్కపేట, మార్గాల్లో ఇరుకు రోడ్లను విస్తరించా రు. మేడారంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. జంపన్న వాగు వద్ద ఆధునికీకరించారు.మేడారంలోని రెండు 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. నార్లాపూర్‌ వద్ద మరో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించారు. విద్యుత్త్​ కోసం 259 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పా టు చేశారు. జంపన్నవాగు పై నుంచి వెళ్లే లైన్ల కోసం ఎత్తయిన టవర్లను కూడా నిర్మించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :