ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని సిఐ.శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు లు అన్నారు. క్రీడలు క్రీడాకారులు ఎప్పుడు కూడా స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన నిరాశ పడవద్దని మళ్లీ ఒకసారి ప్రయత్నం చేస్తే విజయం సాధించవచ్చన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా గురువారంకేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంసింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సౌజన్యంతో అండర్-17, అండర్-14 బాలబాలికలకు బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు ప్రారంభించారు. జిల్లా-జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడా కారులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు . బాస్కెట్బాల్ క్రీడా పోటీల కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ జి.రాజు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పి.రఘునాథ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎండి.యాకూబ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు దుబ్బ శ్రీనివాస్, విజయ్, వహీదా బేగం, సంతోష్, మల్లికా, సీనియర్ క్రీడాకారుడు డిప్పు శ్రీనివాస్, పిటి, పిడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News