ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను పోలీసులు శనివారం గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ నేడు కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపు ఇవ్వడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి, వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో టిఆర్ఎస్ శ్రేణులు శనివారం బంద్ కు పిలుపునిచ్చాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు విద్యాసంస్థ లు స్వచ్ఛందంగా బంధు చేయాలని టిఆర్ఎస్ శ్రేణులు ఒకరోజు ముందు నుండి పిలుపుని చ్చాయి. దీనికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు బంద్ ను విఫలం చేయాలని, వ్యాపార సంస్థలకు మీకు అండగా మేముంటాం మీరు సజావుగా వ్యాపారం చేసుకొని దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించి నాయకులను ముందస్తుగానే అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఏలాంటివ అవాంచనీయ సంఘటన జరుగకుండా పోలీస్ బలగాలు భారీగ చేరుకున్నాయి.
Admin
E Nivas News