ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మంగళవారం ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు. ఈ క్రమంలో రాజి కుదిరిచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి, చాలా ఇబ్బంది పడ్డారన్నారు. జీవన్ రెడ్డికి ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తం అయింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి,పట్టు వదలని విక్రమార్కుడిలా పార్టీ మార్పుపై పట్టు వీడేదిలే దని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందు కని మాట్లాడుతున్నారు. మొన్న మంత్రి శ్రీదర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను పార్టీలో కొనసాగాలని కోరడంతో మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అనడంతో పాటు నిర్ణయంలో మార్పులేదని, పూర్తి వివరాలు 25న వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. అయితే తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్, వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి, బయటకు వచ్చారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యధావిధి గా ఉంటుందని తెలిపారు ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్త తొలగించారు.
Admin
E Nivas News