ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ తన నివాసంలో మంచిర్యాల కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం చేతికి చిక్కారు. సస్పెండ్ అయిన ఉద్యోగికి పెరిగిన వేతనాలు మంజూరు చేసే క్రమంలో మొత్తం రూ. 7 లక్షలు లంచం డిమాండ్ చేశారు. తొలి విడతగా రూ. 2 లక్షలు తీసుకునే సమయంలో వలపన్ని పట్టుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు ఆయనను పక్క ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
E Nivas News