ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలోని మెప్మా కార్యాలయంలో సోమవారం మహిళలకు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించి క్యాన్సరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మీవాని, చందుపట్ల రజిత పాల్గొని క్యాన్సర్ పై పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఓ లావణ్య, టిఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఐతు సితార, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు , ఆర్పీలు మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News