ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లోక్ అదాలత్ ద్వారా కేసు ముగింపు పేరుతో డబ్బు వసూలు చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చైతన్యపురి ఏ ఎస్ఐ బాలయ్య గురువారం పట్టుబడ్డాడు. మహిళా వేధింపుల కేసు లో క్రైమ్ నం. 363/2025 లోక్ అదాలత్ లో కొట్టివేస్తానని బాధితుడు రాంబాబును రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ముందస్తు ఏసీబీ అధికారులు చేసిన ట్రాప్ కు చిక్కాడు. కోర్టు ప్రాంగణంలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏఎస్సై బాలయ్య అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు
Admin
E Nivas News