Wednesday, 17 June 2026 01:36:25 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగావిఫలం

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి

Date : 01 February 2026 11:14 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ పోలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగమే తల తోక లేని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సిట్‌ పేరుతో నోటీసులు జారీ చేశారని తెలిపారు. చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి,దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నేత కేసీఆర్‌ అని స్పష్టంచేశారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను టచ్‌ చేస్తే తెలంగాణ అగ్ని గుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్‌ పార్టీ మాడి మసైపోతుందన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడడంతో యూరియా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలి, కానీ మెదక్లో బిఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి నుంచి గుండాలని రప్పించి వార్డులో ప్రచారం చేయిస్తూ మా పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చూడాలని చెప్పారు. ఐదవ వార్డ్ లో మామిళ్ళ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ ప్రచారానికి వెళితే మల్కాజ్ గిరి నుంచి వచ్చిన గుండాలు కారులో వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి. జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ. ఆంజనేయులు, నాయకులు జుబెర్ అహ్మద్, గౌస్ ఖురేషి, సున్నం నరేష్ శంకర్, మహిళా నాయకులరాలు రాధా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: