ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయి 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా 6 న ఆదిలాబాద్ జిల్లాబోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో సోమవారం జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనులను ఆదివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రేపు జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు , ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు..
Admin
E Nivas News