Friday, 31 July 2026 02:29:06 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆనందోత్సాహాల మధ్య మకర సంక్రాంతి వేడుకలు..

కనువిందు చేస్తున్న రంగవల్లులు...

Date : 15 January 2026 09:13 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలుగుదనాన్ని నింపే మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొనితెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ గురువారం మకర సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉదయాన్నే మహిళలు, యువతులు, పిల్లలంతా ఇండ్ల ముందు లోగిళ్ళను ఆకర్షణీయమైన రంగులతో పలు రకాల రంగవల్లులను వేయడంతో చాలా ఆకట్టుకున్నాయి. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను కూడా పెట్టారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వారికున్న స్థలంలోనే అత్యంత సుందరమైన ముగ్గులు వేశారు.

అలాగే యువకులు పెద్దలు పిల్లలంతా గాలిపటాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. డుడు బసవన్న గంగిరెద్దుల ఆటలతో వాడలన్నీ మార్బ్రోగాయి. అలాగే హరిదాసులు సైతం ఇంటింటా వచ్చి ప్రాచీన రీతిలో పాటలు పాడుతూ భిక్ష తీసుకున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులంతా ఆనందంగా పలు రకాల పిండి వంటలు చేసుకొని గడిపారు. సంక్రదాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్న ప్రజలంతా తమ ఊళ్ళకు వెళ్లడంతో పట్టణాల్లో జన సమూహం తక్కువగా కనిపించింది. మహిళలంతా తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి రకాల వాయినాలు ఇచ్చుకొని సంస్కృతిని ప్రతిబింబజేశారు. పలు పట్టణాల్లో క్రీడలను కూడా నిర్వహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :