Thursday, 30 July 2026 04:51:30 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

Date : 14 July 2026 11:42 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ లను మంథనిలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను జిల్లావ్యాప్తంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదని పాఠ్యపుస్తకాలు కూడా సరిపడా ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు రాక ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :