ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంకు చెందిన ఎల్లంకి శ్రీనివాస్ బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీనివాస్ ఇటీవల దుబాయ్ నుండి సెలవు పై వచ్చాడు. స్వదేశానికి వెళ్లిన గల్ఫ్ కార్మికుడు, ఇండియాలో తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన విషయం దుబాయ్ లో ఉన్న గంగపుత్ర సంఘం సభ్యులకు సమాచారం అందింది.శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల దుబాయ్లోని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సభ్యులు గురువారం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి దుబాయ్లో సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సభ్యులందరూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్ కుటుంబానికి తమ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ వింగ్ అధ్యక్షులు రవి కటుకం, సంఘం అధ్యక్షులు తోకల శంకర్, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నరసన్నలతో పాటు ముఖ్య సభ్యులు పుట్టి రాజు, బింగి నరసయ్య, ఉట్నూర్ నరసన్న, ఇంటెప్పు నరేష్, మేడి రమేష్, పల్లికొండ అనిల్, జుంబర్తి నరేష్, జుంబర్తి తిరుపతి, కల్లెడ మహేష్, కొండ్రా నారాయణ, బింగి పోచన్న తదితరులు పాల్గొని అశ్రునయనాల నివాళులు అర్పించారు.
Admin
E Nivas News