ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యాశాఖ వారోత్సవాల భాగంగా లో భాగంగా విద్యకు ఖర్చు పెట్టేది వృధా కాదని, నర్సరీ నుంచి విద్యను అందిస్తామని, ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజి పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అవకాశం కల్పిస్తామని వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తామన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం అన్నారు. విద్యా శాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉపాధ్యాయులకే ఎక్కువగా తెలుసు అన్ని వర్గాలు కొట్లాడాయి కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ విద్యార్థుల పోరాటం మరువలేని దన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం మా బాధ్యత విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది,పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా ఉద్దేశం అన్నారు. 20 సంవత్సరాలుగా పదోన్నతులు రాణి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాం అన్నారు. విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానం ఇక్కడ కూడా తీసుకొస్తున్నాం అన్నారు. విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ విద్యాశాఖ మంత్రిగా నా బాధ్యత అన్నారు. విద్యాశాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం, అలాగే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పిన చదువు నేర్చుకుని పైకి రావాలి, అటు ఉద్యోగులుగా ఇటు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంత్రులుగా కూడా ఇంకా ఎక్కువగా అంటే సీఎం గా ఎదగాలన్నది నా ఉద్దేశం అన్నారు. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిననినేను కూడా ప్రభుత్వ పాఠశాలలోచదువుకున్న వాన్నేనన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మంత్రి, నాయకుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారని గుర్తు చేశారు. నా ప్రభుత్వంలో 1 లక్ష5000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారందరికీ నెల మొదటి రోజే జీతభత్యాలు అందిస్తున్నామని తెలిపారు. బాధ్యతగా పౌరులను దేశానికి అందించాలన్నదే నా ఉద్దేశమన్నారు. మీరందరూ నాకు సహకరించాలని తెలిపారు. తల్లిదండ్రుల కలను స్వప్నాన్ని విద్యార్థులు కూడా తీర్చాలని కోరారు. వచ్చే సంవత్సరానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అన్నారు. ఇటీవల జరిగినఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
Admin
E Nivas News