ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మనిషికి పుస్తకాలను మించిన స్నేహితులు లేరని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. బాలికల జూనియర్ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జరిగిన లైబ్రరీ డేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ జ్ఞానాన్నీ అందించేది పుస్తకాలే అన్నారు. నేటి కాలంలో డిజిటల్ మాయలో పడి పుస్తకాలకు అందరూ దూరం అవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట సేపు ఏదైనా ఒక పుస్తకం చదివేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు పెంటరీ రాజు, మారూపాక నిహారిక, జంబోజు సమ్మయ్య, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News