ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శివ కేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా కార్తీక బహుళ త్రయోదశి సోమవారం ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు మహిమాన్విత మంథని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామ (108) భజన కీర్తనలతో స్వరాభిషేక మహాయజ్ఞం అంగ రంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరినామ స్మరణ చేసి ఆ లక్ష్మీ నారాయణ స్వామి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు జై శ్రీరామ్ గాయక సమూహం తెలంగాణ సృష్టి కర్త శ్రీ కొత్త శ్రీనివాస్, జై శ్రీరామ్ గాయక సమూహం తెలంగాణ ప్రధాన నిర్వాహకులు కవి రచయిత గాయకులు ఇన్స్ట్రక్టర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాటారం దాతలు భక్తులు గాయనీ గాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
E Nivas News