ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లామందమర్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మోవో సంస్థ, కార్మిక శాఖ సహకారంతో మహిళలకు డ్రైవింగ్ శిక్షణ మరియు ఉపాధి అవకాశాల కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగంగా స్థానిక మహిళలను కలిసి, డ్రైవింగ్ శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు భవిష్యత్ అవసరాలపై అభిప్రాయాలు, తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మోవో వ్యవస్థాపకురాలు మరియు ప్రముఖ బైకర్ జై భారతి, ఆస్ట్రేలియా నుండి డా" జానెల్ హాజరై మహిళల భవిష్యత్ ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం రజనీ, మహిళ నాయకురాళ్ళు పోచంపల్లి లక్ష్మి, రాధ, బత్తుల సరిత, శ్రీలత, సమత, స్రవంతి, రాజేశ్వరి, కవిత, మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News