ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెన్యూ ఫౌండేషన్ సహకారంతో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 6 లక్షల విలువచేసే లైటింగ్ లైవ్స్ ప్రాజెక్టు ద్వారా 7.5 కిలోవార్డ్స్ రూప్ టాప్ సిస్టం సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి పాఠశాలలకు అందించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోసిడింగ్ పేపర్లు సర్పంచ్ గట్టయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్, ఉప సర్పంచ్ గాదె దివ్య సంజీవరెడ్డి, వార్డు సభ్యులు ముసుకుల కృష్ణవేణి, కావటి రజిత, వంగల కీర్తన, రామగిరి సంపత్, పంచాయతీ సెక్రటరీ మధుకర్, ఈ ప్రాజెక్టు ఆఫీసర్ బి ప్రేమ్ చందులు పాల్గొన్నారు.
Admin
E Nivas News