ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను అడ్డుకుని తీరతామంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
Admin
E Nivas News