ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియ తిరుగుతూ వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్యులతోమాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య సిబ్బంది వారి యొక్క సమయాన్నిసారంగా పనిచేయాలని వీధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వచన రోగులను ప్రేమగా చూడాలని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించవద్దని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం పేద ప్రజల వస్తారని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం,అక్కల వెంకటేశ్వర్లు, పూర్ణచందర్రావు, లింగాల తిరుపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News