ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్థానిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన హమాలి కూలీలతో పాటు 50 మంది యువకులు శుక్రవారం గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలను సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ప్రతీ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సమస్యల కొరకు రైతు వేదికలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలుక రాజు, సురేందర్ యాదవ్, సుభాష్, రఫీక్, రఫీ, రమణ గౌడ్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News