ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వేముల లక్ష్మి ప్రసాద్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల జిల్లా అదనపు సెషన్స్ జిల్లా కోర్టు, ఆరవ అదనపు సెషన్స్ కోర్టు మరియు ఏ సి బీ కోర్టు కరీంనగర్ లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా మంథని కోర్టు కి బదిలీపై వచ్చారు. నాలుగు జిల్లాల కరీంనగర్ , పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేముల లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లది కీలకపాత్ర అని, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయoతో పని చేసినేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు.
Admin
E Nivas News