ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు నాయకుల కమిటీ సమావేశం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో కామ్రేడ్ సంకె రవి జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు మహిళా కార్మికులు పని చేస్తున్న పని ప్రాంతాల్లో "రైట్ టు సిట్" పై క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కై కార్మికుల సమస్యల పరిష్కరానికై మార్చి 24నడిపోల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుందని, కార్మికొద్యమా నేత బిటీఆర్ వర్ధంతి, డా,బిర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపేయాన్ కు సీఐటీయు పిలుపు నిచ్చింది.సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే క్యాపెయిన్లో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐటీయు పిలుపు నిచ్చింది.ఈ సమావేశంలో ఎస్. వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, జి. ప్రకాష్, సిహెచ్ దేవదాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News